'బాహుబలి' తలదన్నేలా మరో సినిమా..

- June 05, 2016 , by Maagulf
'బాహుబలి' తలదన్నేలా మరో సినిమా..

ప్రపంచ సినిమాకి భారతీయ సినిమా అంటే 'బాహుబలి' మాత్రమే అన్న పరిస్థితి ఇప్పుడు. అలాంటిది ఆ సినిమాని తలదన్నేలా మరో సినిమా చేయడానికి సన్నద్దమవుతున్నాడు ఓ తమిళ దర్శకుడు. అతడెవరో కాదు, దర్శకుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సుందర్‌ సి. సుమారు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాని తమ వందో చిత్రంగా శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ నిర్మించనుండటం విశేషం. ఈ విషయాన్ని సుందర్ సి భార్య కుష్బూ ధృవీకరించారు కూడా. '' శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ సంస్థలో సుందర్ సి ఓ భారీ సినిమా చేయనున్నారు. ఆయనెప్పుడూ ఓ మంచి సినిమాని ప్రేక్షకులకివ్వడానికే ప్రయత్నిస్తా''రని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చిన కుష్బూ నటీనటులెవరన్నది ఇంకా ఫైనల్ కాలేదంటూ పూర్తి వివరాలతో అధికారక ప్రకటన వస్తుందన్నారు.మరోవైపు థెనాందల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చారిత్రాత్మక చిత్రంలో దక్షిణాదిన అగ్రహీరోలుగా రాణిస్తున్న మహేశ్ బాబు, సూర్య హీరోలుగా నటించనున్నట్టు వినికిడి. ప్రస్తుతం ఈ వార్త ఇరు పరిశ్రమల్లోనూ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా '24' సినిమాతో అందర్నీ మెప్పించిన తిరు పనిచేయనున్నారట. 'బాహుబలి' చిత్రానికి పనిచేసిన సాబు సిరిల్, కమల్ కన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కానున్నారు. సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్, ఇళయరాజా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మహేశ్, సూర్య కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. వాటి అందుకోవడం అంత సులువైతే కాదు. అసలీ కాంబినేషన్‌ డిమాండ్ చేసేలా సుందర్ సి ఎలాంటి కథని సిద్ధం చేసుంటారు..?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com