కాల్షియం డెషిషియన్సీని గుర్తించడమెలా.?
- March 29, 2024
శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం. ఎముకలు ధృడంగా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుండగలదు. ఏ పని చేయడానికైనా శరీరం సహకరించగలదు. అలాంటి అతి కీలకమైన ఎముకల్ని ధృడంగా వుంచడంలో కాల్షియం పాత్ర కీలకం.
ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం వుంటుంది. మిగిలిన ఐదు శాతం కాల్షియం కండరాల నిర్మాణంలో తోడ్పడుతుంది. పెద్ద వారిలో రోజుకు దాదాపు 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం పడుతుంది.
కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనపడడం, కీళ్ల నొప్పులు, పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుపడిపోయే ప్రమాదముంది. మరి, అలాంటి కాల్షియం డెషిషియన్సీని ముందుగానే గుర్తించడమెలా.?
కాల్షియం లోపం కారణంగా విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. తరచూ కీళ్లలో నొప్పులు బాధిస్తుంటాయ్. ఆడవారిలో పీరియడ్స్ సమస్సలు వస్తుంటాయ్. చేతి గోర్లు, కాళి గోర్లు నీర్ఝీవంగా మారి పొడిలా రాలిపోతుంటాయ్. గోళ్లపై తెల్లటి మచ్చలను సైతం గుర్తించవచ్చు.
ఈ లక్షణాలను గుర్తిస్తే.. వెంటనే వైద్యుని సలహా తీసుకుని కాల్షియం పిల్స్ తీసుకోవాల్సి వుంటుంది. అలాగే, నేచురల్గా క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. పాలు, పాల సంబంధిత పదార్ధాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార పదార్ధాల్లోనూ కాల్షియం అధికంగా వుంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









