కాల్షియం డెషిషియన్సీని గుర్తించడమెలా.?
- March 29, 2024శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం. ఎముకలు ధృడంగా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుండగలదు. ఏ పని చేయడానికైనా శరీరం సహకరించగలదు. అలాంటి అతి కీలకమైన ఎముకల్ని ధృడంగా వుంచడంలో కాల్షియం పాత్ర కీలకం.
ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం వుంటుంది. మిగిలిన ఐదు శాతం కాల్షియం కండరాల నిర్మాణంలో తోడ్పడుతుంది. పెద్ద వారిలో రోజుకు దాదాపు 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం పడుతుంది.
కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనపడడం, కీళ్ల నొప్పులు, పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుపడిపోయే ప్రమాదముంది. మరి, అలాంటి కాల్షియం డెషిషియన్సీని ముందుగానే గుర్తించడమెలా.?
కాల్షియం లోపం కారణంగా విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. తరచూ కీళ్లలో నొప్పులు బాధిస్తుంటాయ్. ఆడవారిలో పీరియడ్స్ సమస్సలు వస్తుంటాయ్. చేతి గోర్లు, కాళి గోర్లు నీర్ఝీవంగా మారి పొడిలా రాలిపోతుంటాయ్. గోళ్లపై తెల్లటి మచ్చలను సైతం గుర్తించవచ్చు.
ఈ లక్షణాలను గుర్తిస్తే.. వెంటనే వైద్యుని సలహా తీసుకుని కాల్షియం పిల్స్ తీసుకోవాల్సి వుంటుంది. అలాగే, నేచురల్గా క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. పాలు, పాల సంబంధిత పదార్ధాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార పదార్ధాల్లోనూ కాల్షియం అధికంగా వుంటుంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!