కాల్షియం డెషిషియన్సీని గుర్తించడమెలా.?
- March 29, 2024
శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం. ఎముకలు ధృడంగా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుండగలదు. ఏ పని చేయడానికైనా శరీరం సహకరించగలదు. అలాంటి అతి కీలకమైన ఎముకల్ని ధృడంగా వుంచడంలో కాల్షియం పాత్ర కీలకం.
ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం వుంటుంది. మిగిలిన ఐదు శాతం కాల్షియం కండరాల నిర్మాణంలో తోడ్పడుతుంది. పెద్ద వారిలో రోజుకు దాదాపు 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం పడుతుంది.
కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనపడడం, కీళ్ల నొప్పులు, పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుపడిపోయే ప్రమాదముంది. మరి, అలాంటి కాల్షియం డెషిషియన్సీని ముందుగానే గుర్తించడమెలా.?
కాల్షియం లోపం కారణంగా విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. తరచూ కీళ్లలో నొప్పులు బాధిస్తుంటాయ్. ఆడవారిలో పీరియడ్స్ సమస్సలు వస్తుంటాయ్. చేతి గోర్లు, కాళి గోర్లు నీర్ఝీవంగా మారి పొడిలా రాలిపోతుంటాయ్. గోళ్లపై తెల్లటి మచ్చలను సైతం గుర్తించవచ్చు.
ఈ లక్షణాలను గుర్తిస్తే.. వెంటనే వైద్యుని సలహా తీసుకుని కాల్షియం పిల్స్ తీసుకోవాల్సి వుంటుంది. అలాగే, నేచురల్గా క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. పాలు, పాల సంబంధిత పదార్ధాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార పదార్ధాల్లోనూ కాల్షియం అధికంగా వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన