అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- March 29, 2024
దుబాయ్: దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ విగ్రహాం పూర్తి కాగా.. నిన్న రాత్రి మార్చి 28న అల్లు అర్జున్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహం అల వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ తో పుష్ప మేనరిజం చూపిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఓపెనింగ్ తర్వాత తన మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు తగ్గేదే లే అంటూ కామెంట్ చేశాడు. అలాగే మైనపు విగ్రహం ఓపెనింగ్ వీడియోనూ కూడా పంచుకున్నాడు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోస్ వైరలవుతుండగా.. బన్నీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు సినీ సెలబ్రెటీస్, అభిమానులు.
ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన వెన్నంటే ఉన్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







