లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- March 29, 2024
శ్రీనగర్: జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. ఈ వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్తుండగా, బ్యాటరీ చెష్మా ప్రాంతంలో ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్ పరిసరాల్లో భారీ వర్షాలు కూరుస్తున్నప్పటికీ సహాయక బృందాలు 10 మంది ప్రయాణికుల మృత దేహాలను వెలికితీసాయి. కారు డ్రైవర్ను జమ్మూలోని అంబ ఘ్రోథాకు చెందిన బల్వాన్ సింగ్ (47)గా గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..







