రాజస్థాన్ అవతరణ దినోత్సవం
- March 30, 2024
భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం ఇప్పటి రాజస్థాన్ను రాజ్పుత్నా అని పిలిచేవారు. రాజ్పుత్నాలో 22 రాజ్యాలు ఉండేవి. రాజ్పుత్నాను స్వతంత్ర భారతదేశ ప్రావిన్స్గా మార్చడం, అప్పటి రాజ్పుత్నాలో కొంత భాగాన్ని భారతదేశంలో విలీనం చేయడం చాలా కష్టమైన పని అప్పటి పాలకులు భావించారు.
స్వతంత్ర రాష్ట్రంలో కూడా తమ అధికారాన్ని నిలుపుకోవటానికి రాజ్పుత్నా పాలకులు ప్రయత్నించారు.అందులో భాగంగానే అక్కడ ఉన్న 22 రాజ్యాలను పాలిస్తున్న స్థానిక రాజులు, చక్రవర్తులు స్వయం ప్రతిపత్తి కోసం ఒకానొక దశలో పాకిస్తాన్ లో సైతం కలిసేందుకు సిద్ధపడ్డారని చరిత్రకారులు పేర్కొన్నారు.
అజ్మీర్-మెర్వారా ప్రావిన్స్ బ్రిటిష్ ఆక్రమణలో ఉండేది. ఈ కారణంగా ఇది నేరుగా స్వతంత్ర భారతదేశానికి వచ్చేది. దాంతో మిగిలిన 21 రాజ్యాలను విలీనం చేసి ‘రాజస్థాన్’ గా ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ రాజ్పుత్నా రాజ్యాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయింది. దీనికి సుమారు 8 సంవత్సరాల 7 నెలల 14 రోజుల సమయం పట్టింది. రాజ్యాల ఏకీకరణ తర్వాత 1949 మార్చి 30 న రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడింది.అందువల్ల మార్చి 30న రాజస్థాన్ అవతరణ దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







