రాజస్థాన్ అవతరణ దినోత్సవం
- March 30, 2024భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం ఇప్పటి రాజస్థాన్ను రాజ్పుత్నా అని పిలిచేవారు. రాజ్పుత్నాలో 22 రాజ్యాలు ఉండేవి. రాజ్పుత్నాను స్వతంత్ర భారతదేశ ప్రావిన్స్గా మార్చడం, అప్పటి రాజ్పుత్నాలో కొంత భాగాన్ని భారతదేశంలో విలీనం చేయడం చాలా కష్టమైన పని అప్పటి పాలకులు భావించారు.
స్వతంత్ర రాష్ట్రంలో కూడా తమ అధికారాన్ని నిలుపుకోవటానికి రాజ్పుత్నా పాలకులు ప్రయత్నించారు.అందులో భాగంగానే అక్కడ ఉన్న 22 రాజ్యాలను పాలిస్తున్న స్థానిక రాజులు, చక్రవర్తులు స్వయం ప్రతిపత్తి కోసం ఒకానొక దశలో పాకిస్తాన్ లో సైతం కలిసేందుకు సిద్ధపడ్డారని చరిత్రకారులు పేర్కొన్నారు.
అజ్మీర్-మెర్వారా ప్రావిన్స్ బ్రిటిష్ ఆక్రమణలో ఉండేది. ఈ కారణంగా ఇది నేరుగా స్వతంత్ర భారతదేశానికి వచ్చేది. దాంతో మిగిలిన 21 రాజ్యాలను విలీనం చేసి ‘రాజస్థాన్’ గా ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ రాజ్పుత్నా రాజ్యాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయింది. దీనికి సుమారు 8 సంవత్సరాల 7 నెలల 14 రోజుల సమయం పట్టింది. రాజ్యాల ఏకీకరణ తర్వాత 1949 మార్చి 30 న రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడింది.అందువల్ల మార్చి 30న రాజస్థాన్ అవతరణ దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం