‘టిల్లు స్క్వేర్’ డైరెక్టర్తో సందీప్ కిషన్.!
- April 01, 2024సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన, ‘టిల్లు స్క్వేర్’ రీసెంట్గా రిలీజై ప్రేక్షకాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. యూత్ ప్రధానంగా తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలను బాగానే అందుకుంటూ రేస్లో దూసుకెళ్తోంది.
కాగా, ఈ సినిమా డైరెక్టర్ అయిన మల్లిక్ రామ్, సందీప్ కిషన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందట. ప్రస్తుతానికి వివరాలేమీ తెలీవు కానీ, ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ని సందీప్ కిషన్కి నెరేట్ చేశాడట మల్లిక్ రామ్.
‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాతో ఇటీవల సందీప్ కిషన్ ఓ మోస్తరు సోదిలో నిలిచాడనే చెప్పొచ్చు. ఈ టైమ్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా అంటే కాస్త నిలదొక్కుకునే అవకాశాలున్నాయ్.
మరి, వీలైనంత త్వరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగి, షూటింగ్ పూర్తయ్యి.. ప్రేక్షకుల ముందుకు రావాలి. ఎంత కాదన్నా ఇదంతా జరగాలంటే, మరో ఆరు నెలలు పైనే పడుతుంది. ఏది ఏమైతేనేం, సందీప్ కిషన్ కొత్త ప్రాజెక్ట్ ఒకింత హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!