వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని..!
- April 02, 2024
ముంబై: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ వద్దకు పరుగు తీసుకుంటూ వెళ్లాడు. అయితే రోహిత్ భయాందోళనకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ స్లిప్ లో ఉన్నాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ కు రోహిత్ సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. అభిమాని దగ్గరికి వచ్చే వరకు రోహిత్ శర్మ అతన్ని గమనించలేదు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ రోహిత్ వెనక్కు చూడు అంటూ సూచించడంతో రోహిత్ వెనక్కు మళ్లేసరికి అభిమాని అతనిదగ్గరకి చేరిపోయాడు.. దీంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా భయాందోళనకు గురై రెండు అడుగులు వెనక్కు వేశాడు. అభిమాని అని గుర్తించి అతనికోరిక మేరకు ఓ హగ్ ఇచ్చాడు.. ఆ తరువాత పక్కనే ఉన్న ఇషాంత్ కిషన్ వద్దకు వెళ్లగా.. ఇషాంత్ సైతం రోహిత్ అభిమానికి హగ్ ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంతో గెంతులేస్తూ గ్రౌండ్ లోనుంచి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







