వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని..!
- April 02, 2024
ముంబై: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ వద్దకు పరుగు తీసుకుంటూ వెళ్లాడు. అయితే రోహిత్ భయాందోళనకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ స్లిప్ లో ఉన్నాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ కు రోహిత్ సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. అభిమాని దగ్గరికి వచ్చే వరకు రోహిత్ శర్మ అతన్ని గమనించలేదు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ రోహిత్ వెనక్కు చూడు అంటూ సూచించడంతో రోహిత్ వెనక్కు మళ్లేసరికి అభిమాని అతనిదగ్గరకి చేరిపోయాడు.. దీంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా భయాందోళనకు గురై రెండు అడుగులు వెనక్కు వేశాడు. అభిమాని అని గుర్తించి అతనికోరిక మేరకు ఓ హగ్ ఇచ్చాడు.. ఆ తరువాత పక్కనే ఉన్న ఇషాంత్ కిషన్ వద్దకు వెళ్లగా.. ఇషాంత్ సైతం రోహిత్ అభిమానికి హగ్ ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంతో గెంతులేస్తూ గ్రౌండ్ లోనుంచి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'