వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని..!
- April 02, 2024
ముంబై: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ వద్దకు పరుగు తీసుకుంటూ వెళ్లాడు. అయితే రోహిత్ భయాందోళనకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ స్లిప్ లో ఉన్నాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ కు రోహిత్ సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. అభిమాని దగ్గరికి వచ్చే వరకు రోహిత్ శర్మ అతన్ని గమనించలేదు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ రోహిత్ వెనక్కు చూడు అంటూ సూచించడంతో రోహిత్ వెనక్కు మళ్లేసరికి అభిమాని అతనిదగ్గరకి చేరిపోయాడు.. దీంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా భయాందోళనకు గురై రెండు అడుగులు వెనక్కు వేశాడు. అభిమాని అని గుర్తించి అతనికోరిక మేరకు ఓ హగ్ ఇచ్చాడు.. ఆ తరువాత పక్కనే ఉన్న ఇషాంత్ కిషన్ వద్దకు వెళ్లగా.. ఇషాంత్ సైతం రోహిత్ అభిమానికి హగ్ ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంతో గెంతులేస్తూ గ్రౌండ్ లోనుంచి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







