‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.! నవ్వించలేదు, భయపెట్టలేదు.!
- April 04, 2024
అంజలి ప్రధాన పాత్రలో గతంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకి సీక్వెల్గా వస్తున్న సినిమానే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ సినిమా టీజర్ విషయంలో చాలానే చేశారు. శ్మశానంలో టీజిర్ రిలీజ్ ఈవెంట్ అంటూ హంగామా చేశారు. కానీ, చివరి నిమిషంలో అంత రిస్క్ చేయలేక వెనుకడుగు వేశారు.
తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోతోంది. మొదటి పార్ట్ చివరి భాగంలో డైరెక్టర్ ఛాన్స్ దక్కించుకున్న శ్రినివాస్ రెడ్డి.. తొలి ఛాన్స్ని ఎలా యూజ్ చేసుకున్నాడన్న కథాంశంతో ఈ పార్ట్ స్టోరీ నడుస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు.
రీల్ దెయ్యాలతో తాను సినిమా తెరకెక్కించాలనుకుంటే, రియల్ దెయ్యాలే వచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు రియల్ దెయ్యాల దగ్గర రీల్ దెయ్యాలుగా నటిస్తున్న ఆర్టిస్టులు టిప్స్ తీసుకుంటున్నట్లుగా ట్రైలర్లో చూపించారు.
కానీ, అదేమంత హిలేరియస్గా అనిపించడం లేదు. అంజలి పాత్ర కూడా ఏమంత ఎఫెక్టివ్గా లేదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. హారర్ నేపథ్యం భయపెట్టడమూ లేదు, అలా అని నవ్వించేలానూ లేదన్న రెస్పాన్స్ వస్తోంది ట్రైలర్కి. మరి, ట్రైలర్కే ఇలాంటి రెస్పాన్స్ వస్తోంటే సినిమా సంగతెలా వుంటుందో. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిజల్ట్ తేలిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









