ఎమిరేట్స్ డ్రాలో 39 సార్లు గెలిచిన టర్కిష్ వ్యక్తి.. Dh50,000 అందుకోనున్న భారతీయ ప్రవాసుడు
- April 05, 2024
యూఏఈ: ఇస్తాంబుల్లో నివసించే అలీ సైదీ ఎమిరేట్స్ డ్రాలో 30,000 దిర్హామ్లకు పైగా గెలిచిన తర్వాత తనను తాను "అదృష్టవంతుడు"గా భావించాడు. అతను తన బహుమతిలో కొంత భాగాన్ని మరిన్ని టిక్కెట్లు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పాడు. అతను 2022లో ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకున్నప్పటి నుండి, ప్రతి వారం టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాడు. రాబోయే డ్రాలో Dh15 మిలియన్ల ఈజీ6 గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకుంటాననే ఆశాభావంతో ఉన్నాడు. టర్కీలో లాజిస్టిక్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తున్న అలీ మాట్లాడుతూ.. గెలుపు నన్ను మరింతగా ఆడటానికి ప్రోత్సహిస్తుందని చెప్పాడు.
60,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ డ్రైవర్
దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో ఒక డ్రైవర్ ఈజీ6తో 60,000 దిర్హామ్లను గెలుచుకున్నప్పుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. గెలిచిన దాంట్లోంచి కొన్ని రుణాలు చెల్లించాలని ప్లాన్ చేస్తున్నట్లు అతను చెప్పాడు. కువైట్లో ఫాస్ట్5 డ్రాలో మరో భారతీయ ప్రవాసుడు Dh50,000 అందుకున్నాడు. "నేను ఎప్పుడూ లైవ్ డ్రా చూస్తాను. కానీ ఈసారి నేను ఏదో పనిలో బిజీగా ఉన్నందున చూడలేకపోయాను. నాకు ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు AED 1000 గెలుచుకున్నానని అనుకున్నాను. కానీ నేను Dh50,000 చూసినప్పుడు షాక్ అయ్యాను." అని ఆంధ్రప్రదేశ్కు చెందిన అక్బర్ అలీ అన్నారు. ప్రైజ్ మనీతో తన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









