ఎమిరేట్స్ డ్రాలో 39 సార్లు గెలిచిన టర్కిష్ వ్యక్తి.. Dh50,000 అందుకోనున్న భారతీయ ప్రవాసుడు
- April 05, 2024
యూఏఈ: ఇస్తాంబుల్లో నివసించే అలీ సైదీ ఎమిరేట్స్ డ్రాలో 30,000 దిర్హామ్లకు పైగా గెలిచిన తర్వాత తనను తాను "అదృష్టవంతుడు"గా భావించాడు. అతను తన బహుమతిలో కొంత భాగాన్ని మరిన్ని టిక్కెట్లు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పాడు. అతను 2022లో ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకున్నప్పటి నుండి, ప్రతి వారం టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాడు. రాబోయే డ్రాలో Dh15 మిలియన్ల ఈజీ6 గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకుంటాననే ఆశాభావంతో ఉన్నాడు. టర్కీలో లాజిస్టిక్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తున్న అలీ మాట్లాడుతూ.. గెలుపు నన్ను మరింతగా ఆడటానికి ప్రోత్సహిస్తుందని చెప్పాడు.
60,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ డ్రైవర్
దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో ఒక డ్రైవర్ ఈజీ6తో 60,000 దిర్హామ్లను గెలుచుకున్నప్పుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. గెలిచిన దాంట్లోంచి కొన్ని రుణాలు చెల్లించాలని ప్లాన్ చేస్తున్నట్లు అతను చెప్పాడు. కువైట్లో ఫాస్ట్5 డ్రాలో మరో భారతీయ ప్రవాసుడు Dh50,000 అందుకున్నాడు. "నేను ఎప్పుడూ లైవ్ డ్రా చూస్తాను. కానీ ఈసారి నేను ఏదో పనిలో బిజీగా ఉన్నందున చూడలేకపోయాను. నాకు ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు AED 1000 గెలుచుకున్నానని అనుకున్నాను. కానీ నేను Dh50,000 చూసినప్పుడు షాక్ అయ్యాను." అని ఆంధ్రప్రదేశ్కు చెందిన అక్బర్ అలీ అన్నారు. ప్రైజ్ మనీతో తన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









