నేషనల్ మారిటైమ్ డే
- April 05, 2024
దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలలో అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంతో చుట్టుముట్టబడి, భారతదేశం పురాతన కాలంలోనే శక్తివంతమైన నౌకాదళంగా ఉంది. నేషనల్ మారిటైమ్ వీక్ చివరి రోజున, ఏప్రిల్ 5న భారతదేశంలో జాతీయ సముద్ర దినోత్సవం లేదా నేషనల్ మారిటైమ్ డేను జరుపుకుంటారు.
భారతదేశ నావిగేషన్లో, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ యొక్క మొదటి నౌక SS లాయల్టీ యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించినప్పుడు ఒక చరిత్ర సృష్టించబడింది. సముద్ర మార్గాలు బ్రిటిష్ వారిచే నియంత్రించబడినప్పుడు ఇది భారతదేశ షిప్పింగ్ చరిత్రలో కీలకమైన దశ. ఖండాంతర వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 5,1964న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
నౌకాయాన రంగానికి విశేష కృషి చేసిన విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు సాధించిన వ్యక్తులను గుర్తించి, గౌరవించడం కోసం "NMD అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్" ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈరోజునే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు