వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- April 05, 2024
రియాద్: ఏప్రిల్ 18 (9/10/1445 AH) కంటే ముందు విధించిన ట్రాఫిక్ జరిమానాల చెల్లింపులో 50% తగ్గింపును సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి నిర్ణయించినట్లు తెలిపింది. ఆరు నెలలలోపు మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ తగ్గింపును ప్రవేశపెట్టిన తర్వాత విధించే జరిమానాలకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 75 ప్రకారం 25% తగ్గింపు ఉంటుందని తెలిపింది. చట్టబద్ధంగా సూచించిన చెల్లింపు గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







