వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- April 05, 2024
రియాద్: ఏప్రిల్ 18 (9/10/1445 AH) కంటే ముందు విధించిన ట్రాఫిక్ జరిమానాల చెల్లింపులో 50% తగ్గింపును సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి నిర్ణయించినట్లు తెలిపింది. ఆరు నెలలలోపు మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ తగ్గింపును ప్రవేశపెట్టిన తర్వాత విధించే జరిమానాలకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 75 ప్రకారం 25% తగ్గింపు ఉంటుందని తెలిపింది. చట్టబద్ధంగా సూచించిన చెల్లింపు గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









