వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- April 05, 2024
రియాద్: ఏప్రిల్ 18 (9/10/1445 AH) కంటే ముందు విధించిన ట్రాఫిక్ జరిమానాల చెల్లింపులో 50% తగ్గింపును సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి నిర్ణయించినట్లు తెలిపింది. ఆరు నెలలలోపు మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ తగ్గింపును ప్రవేశపెట్టిన తర్వాత విధించే జరిమానాలకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 75 ప్రకారం 25% తగ్గింపు ఉంటుందని తెలిపింది. చట్టబద్ధంగా సూచించిన చెల్లింపు గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..







