ఐపీఎల్-2024లో మొట్టమొదటి సెంచరీ బాదిన కోహ్లీ..
- April 06, 2024
జైపూర్: ఐపీఎల్-2024లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. 67 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సులతో శతకం సాధించాడు. ఐపీఎల్-2024లో ఇదే మొదటి సెంచరీ. ఐపీఎల్లలో విరాట్ కోహ్లీకి ఇది ఎనిమిదో శతకం.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు
విరాట్ కోహ్లీ -8 సెంచరీలు
క్రిస్ గేల్ – 6 సెంచరీలు
జోస్ బట్లర్ -5 సెంచరీలు
కేఎల్ రాహుల్ -4 సెంచరీలు
డేవిడ్ వార్నర్ -4 సెంచరీలు
షేన్ వాట్సన్ -4 సెంచరీలు
కాగా, టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113(నాటౌట్), డుప్లెసిస్ 44, గ్లెన్ మ్యాక్స్వెల్ 1, సౌరభ్ చౌహన్ 9, గ్రీన్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 2, బర్గర్ ఒక వికట్ తీశారు.
బెంగళూరు జట్టు: డుప్లెసిస్, కోహ్లీ, రజత్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, చౌహాన్, రీస్ టాప్లీ, మయాంక్ దగార్, సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ జట్టు: సంజూ శాంసన్, జైస్వాల్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, ధ్రువ్, షిమ్రాన్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నాంద్రి బర్గర్, యజువేంద్ర చాహెల్
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









