‘పుష్ప మాస్ జాతర’ మొదలైందిగా.!
- April 06, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రమోషన్లు మొదలెట్టేశాడనిపిస్తోంది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
ఎటువంటి అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ ఊహించని విధంగా సంచలనాలు నమోదు చేసింది. ఆ అంచనాలను దాటి వుండేలా ఈ రెండో పార్ట్ చిత్రీకరిస్తున్నారు సుక్కు అండ్ టీమ్.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో రెండు రోజుల్లో అనగా ఏప్రిల్ 8న మరో సర్ప్రైజ్ రానుందని ఓ లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది.
ఆ సర్ప్రైజ్ ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే అంశంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మొదలైంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







