మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్పైనే తొలి సంతకం: సీఎం జగన్
- April 08, 2024అమరావతి: ఏపీలో ప్రచారపర్వం జోరందుకుంది. మేమంతా సిద్దం యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారాయన జనంలో జగన్… జగన్తో జనం… సీఎం జగన్ ప్రచారపర్వంతో మేమంతా సిద్ధం బస్సుయాత్ర వైసీపీలో జోష్ను పెంచింది. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయంటూ పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. నువ్వే కావాలి..మళ్లీ నువ్వే రావాలంటూ నినాదాలు చేశారు.
అవ్వతాతల కళ్లలో ఆనందం చూడ్డమే తమ లక్ష్యమన్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామన్నారు సీఎం జగన్.కుల,మత, పార్టీలకు అతీతంగా గడప గడపకు పెన్షన్లు అందించిన ఘనత వైసీపీదన్నారు. నెలకు రూ.2 వేల కోట్లు పెన్షన్లకే కేటాయిస్తున్నామన్నారు. చెప్పానంటే కచ్చితంగా చేసి చూపిస్తానన్నారు. చంద్రబాబు, కూటమి నేతల తరహాలో అబద్దాలు చెప్పడం తనకు రాదన్నారు సీఎం జగన్. అందరి ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం పెడతామన్నారు సీఎం జగన్. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మేమంతా సిద్దం యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. వినుకొండలో వైసీపీ శ్రేణులు, ప్రజలు సీఎం జగన్కు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం గంటావారిపాలెంలో బస చేస్తారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం