బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు.. కీలక సూత్రధారుల అరెస్ట్
- April 12, 2024
బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరిని ఎన్ఏఐ అరెస్ట్ చేసింది. ఈ బాంబు పేలుడు ఘటనలో సూత్రధారి అయిన అబ్దుల్ మతీన్ తహా, ముసావీర్ హుస్సేన్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంతి వద్ద వీరిద్దరిన అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం (ఏప్రిల్ 12) తెలిపింది.
బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహాలు కోల్కతాకు వెళ్తున్న సమయంలో పట్టుబడ్డారని ఎన్ఐఏ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ బాంబు పేలుడు ఘటన కేసులో మతీన్ తాహా ప్రమేయం ఉందని గుర్తించింది. అంతేకాదు.. 2020 ఉగ్రవాదం కేసులో కూడా వీరికి ప్రమేయం ఉందని తెలిపింది. ఈ కేసులో కీలక సూత్రధారులైన వీరిద్దరిని అరెస్టు చేయగా.. గత నెలలో షాజేబ్, తాహాలకు సహకరించిన ముజమ్మిల్ షరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లోని 18 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో షాజేబ్, తాహా నివాసితులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









