పేదలకు సాయంపై క్యాంపెయిన్
- June 06, 2016
పవిత్ర రమదాన్ సందర్భంగా పేదవారిని ఆదుకునేందుకోసం చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. 'ది ట్రీ ఆఫ్ గాడ్ డీడ్స్' ప్రోగ్రామ్ ద్వారా సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచనున్నారు. షేక్ రషీద్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్, నహతామ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, గ్రేస్ కన్వర్జేషన్స్, ఖాలిదియా మాల్ వంటి సంస్థలు ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ట్రీ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్లో భాగంగా, ఒక్కొక్కరూ ఒక్కో ఆకుని 10 దిర్హామ్లకు కొనుగోలు చేసి, చెట్టుకి అతికించడం ద్వారా జీవం లేని చెట్టుకి జీవం పోసినట్లవుతుందనే గొప్ప విషయాన్ని నిరూపించనున్నారు. పేదలకు సహాయం చేసేందుకు ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్తో ఎవరైనా ముందుకు వస్తే, వారికి విశేష ప్రాచుర్యం కల్పిస్తామని, సమాజానికి వారు సేవ చేసినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









