పేదలకు సాయంపై క్యాంపెయిన్
- June 06, 2016
పవిత్ర రమదాన్ సందర్భంగా పేదవారిని ఆదుకునేందుకోసం చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. 'ది ట్రీ ఆఫ్ గాడ్ డీడ్స్' ప్రోగ్రామ్ ద్వారా సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచనున్నారు. షేక్ రషీద్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్, నహతామ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, గ్రేస్ కన్వర్జేషన్స్, ఖాలిదియా మాల్ వంటి సంస్థలు ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ట్రీ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్లో భాగంగా, ఒక్కొక్కరూ ఒక్కో ఆకుని 10 దిర్హామ్లకు కొనుగోలు చేసి, చెట్టుకి అతికించడం ద్వారా జీవం లేని చెట్టుకి జీవం పోసినట్లవుతుందనే గొప్ప విషయాన్ని నిరూపించనున్నారు. పేదలకు సహాయం చేసేందుకు ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్తో ఎవరైనా ముందుకు వస్తే, వారికి విశేష ప్రాచుర్యం కల్పిస్తామని, సమాజానికి వారు సేవ చేసినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







