యూఏఈలో మరో రెండు రోజులపాటు వర్షాలు..!
- April 16, 2024
యూఏఈ: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు యూఏఈని అతలాకుతలం చేశాయి. అయితే బుధవారం వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ హెచ్చరించింది. భారీ వర్షం మరియు శక్తివంతమైన గాలుల శబ్దంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేల్కొన్నట్లు అబుదాబి నివాసి జలాలీ తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నాడు. అబుదాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా మరియు రస్ అల్ ఖైమాలోని నివాసితులు అల్పపీడనం కారణంగా వర్షపాతం నమోదైంది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ బతీన్ విమానాశ్రయం మరియు షార్జా మరియు ఫుజైరాలోని విమానాశ్రయాలతో సహా కీలక విమానాశ్రయాలపై ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 16న యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ రిమోట్గా పని చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రైవేట్ రంగ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్లోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను రిమోట్ లెర్నింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని ప్రభుత్వ సంస్థలను కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు తీవ్రమవుతున్నందున యూఏఈ నుండి బయలుదేరే కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చని ఎయిర్లైన్ ప్రతినిధులు తెలిపారు. అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ ఏప్రిల్ 15-16 తేదీలలో భారీ వర్షాలు కొన్ని విమానాలను ఆలస్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రయాణీకులు ఎయిర్లైన్ వెబ్సైట్ను క్రమం తప్పకుండా చెక్ చేయాలని మరియు సూచించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







