ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- April 18, 2024
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉత్తర ఉక్రెయిన్ లోని చెర్నిహిల్ నగరంపై బుధవారం రష్యా మూడు క్షిపణులను ప్రయోగించింది. అవి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో 17 మంది మృతిచెందారు. 61 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నివ్ రాజధాని కీవ్కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా – బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇరుదేశాల మధ్య 2022, ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. రష్యా భారీస్థాయిలో దాడులు నిర్వహిస్తుండగా, ఆయుధాల కొరతతో ఇబ్బండి పడుతున్న ఉక్రెయిన్ దళాలులు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి. రష్యా దాడితో భవనాలు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్ క్లమెంకో తెలిపారు. కార్లు, మున్సిపల్ ఇన్ఫ్రాస్టక్చర్ పూర్తి ధ్వంసమయ్యాయని వెల్లడించారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. ఇస్కాండర్ క్రూయిజ్ క్షిపణులతో రష్యా ఈ దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ సిటీ నుంచి చెర్నిహిల్150 కి.మీ, రష్యా సరిహద్దు నుంచి దాదాపు 80 కి.మీ దూరంలో ఉంటుంది. ఉక్రెయిన్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు స్కూల్స్, హాస్పిటల్, ఇళ్లు ఉండే ప్రాంతంలో మూడు క్షిపణులతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఒక హోటల్ ధ్వంసమైందని అధికారులు తెలిపారు. నివాస భవనాలు, ఆసుపత్రి, విద్యా సౌకర్యం, డజన్ల కొద్దీ ప్రైవేట్ కార్లు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?