మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- April 20, 2024
న్యూయార్క్: మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని కోరింది. గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది. త్రైమాసిక బహిరంగ చర్చకు ముందు "మిడిల్ ఈస్ట్లో పరిస్థితి’’ పై న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చర్చించారు. గాజా స్ట్రిప్లోని పరిస్థితిని అదుపు చేయాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం మరియు అవసరమైన సేవలను అందజేయాలని కోరారు. రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలు ప్రారంభించిన సైనిక చర్యను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దురక్రమణ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గాజాకు తక్షణ సాయాన్ని అందించాలని HE షేఖా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ పిలుపునిచ్చారు. గాజాలో మారణహోమాన్ని నిరోధించడానికి ఇజ్రాయెల్ పుష్కలంగా చర్యలు తీసుకోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పును అమలు చేయడం అత్యవసరమని షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!