షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- April 20, 2024
యూఏఈ: షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమంగా దొరికాడు. ఆదివారం నుంచి షార్జాలో కనిపించ కుండా పోయిన పాకిస్థాన్ యువకుడు మహ్మద్ అబ్దుల్లా దాదాపు వారం రోజుల తర్వాత క్షేమంగా దొరికాడు. అతని తండ్రి, అలీ, ఈరోజు తెల్లవారుజామున ఈ విషయాన్ని తెలియజేశాడు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని, షార్జా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడని ధృవీకరించాడు. ఈ సందర్భంగా సెర్చ్ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
కవల పిల్లలలో ఒకరైన అబ్దుల్లా.. ఏప్రిల్ 14 న, మరమ్మతుల కోసం సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్ నుండి కార్పెంటర్ను తీసుకురావడానికి సాయంత్రం 4.15 గంటలకు అబూ షగరాలోని తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత అదృశ్యమయ్యాడు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









