'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న‌ 6,300 మంది ప్రవాసులు

- April 23, 2024 , by Maagulf
\'క్షమాభిక్ష\'ను వినియోగించుకున్న‌ 6,300 మంది ప్రవాసులు

కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన క్షమాభిక్ష ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 1,807 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు కువైట్‌ను విడిచివెళ్లారు.  4,565 మంది ప్రవాసులు తమ నివాస స్థితిని సరి చేసుకున్నారు. వాటిలో ఎక్కువ భాగం ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 18 రెసిడెన్సీ ప‌రిధిలో ఉన్న‌వే. అయితే కొద్ది మంది విజిట్ వీసా హోల్డర్లు కూడా దేశం విడిచి వెళ్ళడానికి క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు. నివేదిక ప్రకారం.. దాదాపు 2,801 మంది ప్రవాసులు, తమ పాస్‌పోర్ట్‌లను పోగొట్టుకున్నారు లేదా వారి స్పాన్సర్‌ల ఆధీనంలో ఉన్నారు. వీరంద‌రూ దేశం విడిచి వెళ్ళడానికి వారి రాయబార కార్యాలయాల నుండి ప్రయాణ పత్రాలను పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com