ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

- April 24, 2024 , by Maagulf
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) గా పీహెచ్ డీ రామకృష్ణ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా పై నిన్న ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.

వీరి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ..ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తాగ నియమితులైన అధికారులు గురువారం ఉదయం లోగా బాధ్యతలు చేపట్టాలి ఈసీ ఆదేశించింది.

పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ్ .. ఎన్నికల షెడ్యుల్ వచ్చిన తర్వాత కూడా వైసీపీకి అనుకూలంగా, ఏకపక్షంగా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ చివరికి వారిద్దరిపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com