ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- April 24, 2024
న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్ర దుమారం రేపిన ఆ వ్యాఖ్యలపై పలు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఈసీ చెప్పింది. కాంగ్రెస్తో పాటు సీపీఐ పార్టీలు ప్రధాని మోడీ స్పీచ్పై ఫిర్యాదు చేశాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ప్రజల సంపదను ముస్లింలకు పంచుతామని కాంగ్రెస్ తెలిపిందని, దేశ వనరులపై తొలి హక్కు మైనార్టీలకు ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మోడీ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, ఓ మతాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ప్రధానిపై ఈసీ చర్యలు తీసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







