ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- April 24, 2024న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్ర దుమారం రేపిన ఆ వ్యాఖ్యలపై పలు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఈసీ చెప్పింది. కాంగ్రెస్తో పాటు సీపీఐ పార్టీలు ప్రధాని మోడీ స్పీచ్పై ఫిర్యాదు చేశాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ప్రజల సంపదను ముస్లింలకు పంచుతామని కాంగ్రెస్ తెలిపిందని, దేశ వనరులపై తొలి హక్కు మైనార్టీలకు ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మోడీ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, ఓ మతాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ప్రధానిపై ఈసీ చర్యలు తీసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?