ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- April 24, 2024
న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్ర దుమారం రేపిన ఆ వ్యాఖ్యలపై పలు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఈసీ చెప్పింది. కాంగ్రెస్తో పాటు సీపీఐ పార్టీలు ప్రధాని మోడీ స్పీచ్పై ఫిర్యాదు చేశాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ప్రజల సంపదను ముస్లింలకు పంచుతామని కాంగ్రెస్ తెలిపిందని, దేశ వనరులపై తొలి హక్కు మైనార్టీలకు ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మోడీ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, ఓ మతాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ప్రధానిపై ఈసీ చర్యలు తీసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!







