సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- April 29, 2024
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ రియాద్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక సమావేశంలో "వెకేషనోమిక్స్" పేరుతో చర్చా సందర్భంగా దేశ పర్యాటక రంగంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు ప్రకటించారు. 2024 మొదటి త్రైమాసికంలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు అల్-ఖతీబ్ తెలిపారు. పర్యాటకుల ఖర్చు 17% కంటే ఎక్కువ పెరిగిందన్నారు. గత సంవత్సరం దాని పర్యాటక ఆదాయాన్ని $34 బిలియన్ల నుండి $66 బిలియన్లకు చేరిందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి టూరిజం ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







