జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి

- May 09, 2024 , by Maagulf
జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. జహ్రా గవర్నర్ HE మిస్టర్ హమద్ జాసిమ్ మొహమ్మద్ అల్-హబాషిని మర్యాదపూర్వకంగా కలిశారు. జహ్రా గవర్నరేట్ కొత్త గవర్నర్‌గా నియమితులైనందుకు రాయబారి ఆయనకు అభినందనలు తెలిపారు. జహ్రాలో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించడాన్ని గవర్నర్ స్వాగతించారు.  భారతీయ కంపెనీలతో జహ్రా ప్రాంతం మరింత వాణిజ్య సహకారం కోసం తన ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం ఇటీవల జహ్రాలో కొత్త ఇండియన్ వీసా మరియు కాన్సులర్ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com