66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- May 09, 2024
రియాద్: ఎలక్ట్రానిక్ విజిట్ వీసాలు పొందేందుకు అర్హత ఉన్న దేశాల జాబితాలో మూడు కొత్త దేశాలను చేర్చినట్లు సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. కొత్త చేరిన దేశాలలో కామన్వెల్త్
కరేబియన్ దేశాలైన బహామాస్, బార్బడోస్ మరియు గ్రెనడా ఉన్నాయి. ఈ విస్తరణతో ఇ-విజిట్ వీసా పాలనలో ఉన్న మొత్తం దేశాల సంఖ్య 66కి చేరుకుంది. సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ మూడు దేశాల పౌరులు దీనికి అర్హులని ప్రకటించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులకు మరపురాని పర్యాటక అనుభూతిని అందించడానికి సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలలో ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టారు. ఈ దేశాల పౌరులకు ఒక సంవత్సరం చెల్లుబాటుతో మల్టీ రీఎంట్రీ ఇ-విజిట్ వీసా మంజూరు చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలను visitsaudi.com వెబ్సైట్ నుండి పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









