66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- May 09, 2024
రియాద్: ఎలక్ట్రానిక్ విజిట్ వీసాలు పొందేందుకు అర్హత ఉన్న దేశాల జాబితాలో మూడు కొత్త దేశాలను చేర్చినట్లు సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. కొత్త చేరిన దేశాలలో కామన్వెల్త్
కరేబియన్ దేశాలైన బహామాస్, బార్బడోస్ మరియు గ్రెనడా ఉన్నాయి. ఈ విస్తరణతో ఇ-విజిట్ వీసా పాలనలో ఉన్న మొత్తం దేశాల సంఖ్య 66కి చేరుకుంది. సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ మూడు దేశాల పౌరులు దీనికి అర్హులని ప్రకటించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులకు మరపురాని పర్యాటక అనుభూతిని అందించడానికి సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలలో ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టారు. ఈ దేశాల పౌరులకు ఒక సంవత్సరం చెల్లుబాటుతో మల్టీ రీఎంట్రీ ఇ-విజిట్ వీసా మంజూరు చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలను visitsaudi.com వెబ్సైట్ నుండి పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







