ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- May 17, 2024
యూఏఈ: మీరు ఆన్లైన్లో విక్రయిస్తున్న కారు లేదా బ్యాగ్ కోసం కొనుగోలుదారుడు సంప్రదించాడా? నకిలీ బ్యాంకు రశీదులు పంపే మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ అమ్మకందారులను లక్ష్యంగా చేసుకున్న స్కామ్ గురించి అబుదాబి పోలీసులు శుక్రవారం నివాసితులను అప్రమత్తం చేశారు. ఈ బూటకపు కొనుగోలుదారులు సాధారణంగా 'రసీదులను' పంపుతారని, వారు ఇప్పటికే డబ్బును పంపినట్లు చెబుతారని, కానీ చెల్లింపు చేయరని తేలిందని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ కల్నల్ మస్లిం ముహమ్మద్ అల్ అమరీ తెలిపారు. డబ్బు అందే వరకు వస్తువులను ఇవ్వవద్దని కల్నల్ అల్ అమరీ విక్రేతలను కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అబుదాబిలో ఉన్నవారు టోల్-ఫ్రీ హాట్లైన్ 8002626 (AMAN2626) లేదా SMS (2828) ద్వారా లేదా [email protected] ae కి ఇ-మెయిల్ పంపడం ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారులు పోలీసుల అధికారిక యాప్ను కూడా ఉపయోగించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







