1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- May 17, 2024
యూఏఈ: 1,300 కంటే ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు 2022 మధ్య నుండి మే 16 వరకు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) శుక్రవారం ప్రకటించింది. ఉల్లంఘించిన వారికి ఒక్కో కేసుకు Dh 20,000 నుండి Dh100,000 వరకు జరిమానా విధించబడింది. ఈ 1,379 సంస్థలు 2,170 మంది యూఏఈ పౌరులను అక్రమంగా నియమించుకున్నట్లు తేలిందని మోహ్రే తెలిపారు. దేశంలోని ప్రైవేట్ కంపెనీలు 2026 నాటికి కనీసం 10 శాతానికి చేరుకోవడానికి తమ ఎమిరాటీ వర్క్ఫోర్స్ శాతాన్ని ప్రతి సంవత్సరం రెండు శాతం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సేకరించిన డేటా ఆధారంగా దేశంలోని దాదాపు 20,000 ప్రైవేట్ కంపెనీల్లో 97,000 మందికి పైగా ఎమిరాటీలు పనిచేస్తున్నారని మోహ్రే తెలిపింది. Dh100,000 వరకు భారీ జరిమానాలతో పాటు, ఉల్లంఘించిన వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు వెల్లడించింది. 600590000కు డయల్ చేయడం ద్వారా లేదా మోహ్రే యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కార్మిక నిబంధనలను ఉల్లంఘించే సంస్థల వివరాలను నివేదించాలని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







