దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- May 18, 2024
దుబాయ్: నిర్మాణాత్మక సమస్యల కారణంగా తమ ఇళ్లను ఖాళీ చేసి వచ్చి దాదాపు ఒక నెల అవుతుందని అల్ ఖసీర్ భవనంలోని నివాసితులు వాపోయారు. 10 రోజుల వరకు, మా ఇంటి యజమాని మా బస కోసం మా ఖర్చులను తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడని రెండు సంవత్సరాలుగా భవనంలో నివసిస్తున్న నావల్ చెప్పారు.ఆ తర్వాత మే 12న మా ఇళ్లకు తిరిగి రావచ్చని మాకు చెప్పారని, కానీ అలా జరగలేదన్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. నెలాఖరులోగా బిల్డింగ్ రెడీ అవుతుందట. అప్పటి వరకు తాము హోటల్ అపార్ట్మెంట్ల కోసం ఖర్చులు పెట్టాల్సిందేనని అన్నారు. ఏప్రిల్ 19 సాయంత్రం ముహైస్నా 4లోని భవనం దెబ్బతినడంతో అది కుంగింది. అనంతరం అందులో ఉంటున్న నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. వాస్తవానికి, గత నెలలో తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సిన చాలా మంది నివాసితులు తమ అద్దెలలో Dh2,000 నుండి Dh3,000 వరకు పెరుగుదలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఇళ్ల కోసం వెతుకుతున్నందున డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా కొందరు ఏజెంట్లు చాలా కమీషన్ వసూలు చేసినట్టు నివాసితులు వాపోయారు. కొంతమంది నివాసితులు ఇతర ఇళ్లకు మారుతుండగా, మరికొందరు భవనంలోకి తిరిగి వెళ్లడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









