దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- May 18, 2024
దుబాయ్: నిర్మాణాత్మక సమస్యల కారణంగా తమ ఇళ్లను ఖాళీ చేసి వచ్చి దాదాపు ఒక నెల అవుతుందని అల్ ఖసీర్ భవనంలోని నివాసితులు వాపోయారు. 10 రోజుల వరకు, మా ఇంటి యజమాని మా బస కోసం మా ఖర్చులను తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడని రెండు సంవత్సరాలుగా భవనంలో నివసిస్తున్న నావల్ చెప్పారు.ఆ తర్వాత మే 12న మా ఇళ్లకు తిరిగి రావచ్చని మాకు చెప్పారని, కానీ అలా జరగలేదన్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. నెలాఖరులోగా బిల్డింగ్ రెడీ అవుతుందట. అప్పటి వరకు తాము హోటల్ అపార్ట్మెంట్ల కోసం ఖర్చులు పెట్టాల్సిందేనని అన్నారు. ఏప్రిల్ 19 సాయంత్రం ముహైస్నా 4లోని భవనం దెబ్బతినడంతో అది కుంగింది. అనంతరం అందులో ఉంటున్న నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. వాస్తవానికి, గత నెలలో తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సిన చాలా మంది నివాసితులు తమ అద్దెలలో Dh2,000 నుండి Dh3,000 వరకు పెరుగుదలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఇళ్ల కోసం వెతుకుతున్నందున డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా కొందరు ఏజెంట్లు చాలా కమీషన్ వసూలు చేసినట్టు నివాసితులు వాపోయారు. కొంతమంది నివాసితులు ఇతర ఇళ్లకు మారుతుండగా, మరికొందరు భవనంలోకి తిరిగి వెళ్లడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!









