భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- May 19, 2024
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గతేడాది అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఈ దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదికలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు యూకేకు చెందిన ఐటీవీ తెలిపింది. వారి సంపద మునుపటి సంవత్సరంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండగా.. ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని వెల్లడించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తులు నేల చూపులు చూస్తున్న వేళ..
ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు భారీగా పెరగడం గమనార్హం. అయితే, తండ్రి నారాయణ మూర్తి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి అధిక షేర్లు ఉన్న కారణంగా వాళ్ల ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక సునాక్ దంపతులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. బ్రిటన్లోని 350 మంది సంపన్న వ్యక్తులు, కుటుంబాలు ఏకంగా 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









