భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- May 19, 2024
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గతేడాది అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఈ దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదికలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు యూకేకు చెందిన ఐటీవీ తెలిపింది. వారి సంపద మునుపటి సంవత్సరంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండగా.. ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని వెల్లడించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తులు నేల చూపులు చూస్తున్న వేళ..
ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు భారీగా పెరగడం గమనార్హం. అయితే, తండ్రి నారాయణ మూర్తి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి అధిక షేర్లు ఉన్న కారణంగా వాళ్ల ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక సునాక్ దంపతులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. బ్రిటన్లోని 350 మంది సంపన్న వ్యక్తులు, కుటుంబాలు ఏకంగా 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









