భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- May 19, 2024![1 భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు](https://www.maagulf.com/godata/articles/202405/aaa_1716103977.jpg)
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గతేడాది అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఈ దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదికలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు యూకేకు చెందిన ఐటీవీ తెలిపింది. వారి సంపద మునుపటి సంవత్సరంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండగా.. ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని వెల్లడించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తులు నేల చూపులు చూస్తున్న వేళ..
ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు భారీగా పెరగడం గమనార్హం. అయితే, తండ్రి నారాయణ మూర్తి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి అధిక షేర్లు ఉన్న కారణంగా వాళ్ల ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక సునాక్ దంపతులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. బ్రిటన్లోని 350 మంది సంపన్న వ్యక్తులు, కుటుంబాలు ఏకంగా 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర