విదేశీ పర్యటనకు చంద్రబాబు
- May 19, 2024
హైదరాబాద్: దాదాపుగా రెండు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీబిజీగా గడిపారు. క్షణం తీరికలేకుండా ప్రజల్లోకి వెళ్లారు. ఎట్టకేలకు పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త సేద తీరేందుకు సమయం దొరికింది. మరోవైపు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాస్త టెన్షన్ లో కనిపిస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే రిలాక్స్ అయ్యేందుకు నేతలంతా విహార యాత్రలకు బయల్దేరుతున్నారు. వరుస ప్రచారాలు, ఎన్నికల వ్యూహాలు, సభలతో నిర్విరామంగా తిరిగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విశ్రాంతి కోసం నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు... వారం రోజుల తర్వాత తిరిగి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగిరానున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 31వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







