షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునః ప్రారంభం
- May 19, 2024
దుబాయ్: షెడ్యూల్ కంటే ముందే మూడు మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం అయ్యాయి. ఆన్పాసివ్ నుండి మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, ఇబ్న్ బటుటాకు ప్రతిరోజూ ప్రయాణించే దుబాయ్ మెట్రో కమ్యూటర్ ఇమానే ఎజ్జెమనీ హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 16 తుఫాను తర్వాత నాలుగు స్టేషన్లను మూసివేసారు. దీంతో తమ ప్రయాణ సమయం మూడు రెట్లు పెరిగిందని పలువురు నివాసితులు వాపోయారు. స్టేషన్ మూసివేయడానికి ముందు, తన ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టేదని, కానీ గత నెల తనకు దాదాపు మూడు గంటల సమయం పట్టిందన్నారు. దుబాయ్ మెట్రో మూడు స్టేషన్లలో తిరిగి పనిచేయడంతో ఊపిరి పీల్చుకున్న వందలాది మంది ప్రయాణికుల్లో ఇమానే ఒకరు. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ముందుగా నాలుగు స్టేషన్లు మే 28న ప్రారంభమవుతాయని ప్రకటించింది. అయితే, అవసరమైన నిర్వహణ మరియు పరీక్షల తర్వాత, అధికారం షెడ్యూల్ కంటే ముందుగానే ఆన్పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మెట్రో స్టేషన్లు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!
- ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- దుబాయ్ సర్జన్ క్రెడిట్ కార్డ్ హ్యాక్..Dh120,000 ఖాళీ..!!