నిద్ర సరిగా పట్టడం లేదా.? అయితే సింపుల్గా ఇలా చేసి చూడండి.!
- May 21, 2024
చాలా మందిలో నిద్రలేమి సమస్య వుంటుంది. ఏం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందుకోసం కొందరయితే నిద్ర మాత్రలు వాడాల్సి వస్తుంది కూడా.
కానీ, చాలా సింపుల్గా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు చేయాల్సిందల్లా.. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తినడమే.
చూశారా సమస్య అరటి పండు తిన్నంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. అరటి పండు తింటే నిద్రలేమీ తగ్గిపోతుందా.? అంటే తగ్గేందుకు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ని ప్రభావితం చేస్తుంది. అరటి పండులోని అమినో యాసిడ్ సెరోటోనిన్ మెలటోనిన్గా మార్చడంతో నిద్రకు ఉపక్రమించేలా నాడుల్ని యాక్టివ్ చేస్తాయ్.
అంతేకాదు, అరటి పండులోని మెగ్నీషియం మరియు పొటాషియం కండరాల సడలింపును నియంత్రిస్తాయ్ తద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయ్. పడుకునే ముందు అరటి పండు తినడం వల్ల ఈ లాభాలు ఖచ్చితంగా జరుగుతాయ్.
అందుకే నిద్రకుపక్రమించే ముందు ప్రతీ రోజూ ఓ అరటి పండు తినడం వల్ల సుఖ నిద్ర సొంతమవుతుంది. అంతేకాదు, అరటి పండులో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ఊబకాయాన్ని కలిగించే క్యాలరీలు తక్కువగా వుంటాయ్. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే ప్రతీరోజూ అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!