నిద్ర సరిగా పట్టడం లేదా.? అయితే సింపుల్గా ఇలా చేసి చూడండి.!
- May 21, 2024
చాలా మందిలో నిద్రలేమి సమస్య వుంటుంది. ఏం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందుకోసం కొందరయితే నిద్ర మాత్రలు వాడాల్సి వస్తుంది కూడా.
కానీ, చాలా సింపుల్గా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు చేయాల్సిందల్లా.. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తినడమే.
చూశారా సమస్య అరటి పండు తిన్నంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. అరటి పండు తింటే నిద్రలేమీ తగ్గిపోతుందా.? అంటే తగ్గేందుకు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ని ప్రభావితం చేస్తుంది. అరటి పండులోని అమినో యాసిడ్ సెరోటోనిన్ మెలటోనిన్గా మార్చడంతో నిద్రకు ఉపక్రమించేలా నాడుల్ని యాక్టివ్ చేస్తాయ్.
అంతేకాదు, అరటి పండులోని మెగ్నీషియం మరియు పొటాషియం కండరాల సడలింపును నియంత్రిస్తాయ్ తద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయ్. పడుకునే ముందు అరటి పండు తినడం వల్ల ఈ లాభాలు ఖచ్చితంగా జరుగుతాయ్.
అందుకే నిద్రకుపక్రమించే ముందు ప్రతీ రోజూ ఓ అరటి పండు తినడం వల్ల సుఖ నిద్ర సొంతమవుతుంది. అంతేకాదు, అరటి పండులో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ఊబకాయాన్ని కలిగించే క్యాలరీలు తక్కువగా వుంటాయ్. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే ప్రతీరోజూ అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!