నిద్ర సరిగా పట్టడం లేదా.? అయితే సింపుల్గా ఇలా చేసి చూడండి.!
- May 21, 2024
చాలా మందిలో నిద్రలేమి సమస్య వుంటుంది. ఏం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందుకోసం కొందరయితే నిద్ర మాత్రలు వాడాల్సి వస్తుంది కూడా.
కానీ, చాలా సింపుల్గా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు చేయాల్సిందల్లా.. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తినడమే.
చూశారా సమస్య అరటి పండు తిన్నంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. అరటి పండు తింటే నిద్రలేమీ తగ్గిపోతుందా.? అంటే తగ్గేందుకు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ని ప్రభావితం చేస్తుంది. అరటి పండులోని అమినో యాసిడ్ సెరోటోనిన్ మెలటోనిన్గా మార్చడంతో నిద్రకు ఉపక్రమించేలా నాడుల్ని యాక్టివ్ చేస్తాయ్.
అంతేకాదు, అరటి పండులోని మెగ్నీషియం మరియు పొటాషియం కండరాల సడలింపును నియంత్రిస్తాయ్ తద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయ్. పడుకునే ముందు అరటి పండు తినడం వల్ల ఈ లాభాలు ఖచ్చితంగా జరుగుతాయ్.
అందుకే నిద్రకుపక్రమించే ముందు ప్రతీ రోజూ ఓ అరటి పండు తినడం వల్ల సుఖ నిద్ర సొంతమవుతుంది. అంతేకాదు, అరటి పండులో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ఊబకాయాన్ని కలిగించే క్యాలరీలు తక్కువగా వుంటాయ్. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే ప్రతీరోజూ అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









