నిద్ర సరిగా పట్టడం లేదా.? అయితే సింపుల్గా ఇలా చేసి చూడండి.!
- May 21, 2024
చాలా మందిలో నిద్రలేమి సమస్య వుంటుంది. ఏం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందుకోసం కొందరయితే నిద్ర మాత్రలు వాడాల్సి వస్తుంది కూడా.
కానీ, చాలా సింపుల్గా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు చేయాల్సిందల్లా.. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తినడమే.
చూశారా సమస్య అరటి పండు తిన్నంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. అరటి పండు తింటే నిద్రలేమీ తగ్గిపోతుందా.? అంటే తగ్గేందుకు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ని ప్రభావితం చేస్తుంది. అరటి పండులోని అమినో యాసిడ్ సెరోటోనిన్ మెలటోనిన్గా మార్చడంతో నిద్రకు ఉపక్రమించేలా నాడుల్ని యాక్టివ్ చేస్తాయ్.
అంతేకాదు, అరటి పండులోని మెగ్నీషియం మరియు పొటాషియం కండరాల సడలింపును నియంత్రిస్తాయ్ తద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయ్. పడుకునే ముందు అరటి పండు తినడం వల్ల ఈ లాభాలు ఖచ్చితంగా జరుగుతాయ్.
అందుకే నిద్రకుపక్రమించే ముందు ప్రతీ రోజూ ఓ అరటి పండు తినడం వల్ల సుఖ నిద్ర సొంతమవుతుంది. అంతేకాదు, అరటి పండులో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ఊబకాయాన్ని కలిగించే క్యాలరీలు తక్కువగా వుంటాయ్. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే ప్రతీరోజూ అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..









