గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- May 22, 2024
అబుదాబి: ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ PAM గ్లోబల్ హ్యుమానిటేరియన్ పర్సనాలిటీ అవార్డును అందుకున్నారు. దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించిన అంతర్జాతీయ మానవతా ప్రయత్నాలకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అబుదాబిలోని కస్ర్ అల్ బహర్లో జరిగిన సమావేశంలో ఆయనను గ్లోబల్ హ్యుమానిటేరియన్ పర్సనాలిటీగా ఎంపిక చేసినందుకు ప్రతినిధి బృందానికి హిస్ హైనెస్ తన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా విపత్తులు మరియు సంక్షోభ ప్రాంతాలలో సమస్యలను తగ్గించడానికి యూఏఈ తన ప్రపంచ భాగస్వాముల సహకారంతో ఈ మానవతా విధానాన్ని కొనసాగిస్తుందని హిస్ హైనెస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మానవతా కార్యక్రమాలను ప్రతినిధి బృందం ప్రశంసించింది. ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సహాయం చేసిన మానవతావాద ప్రయత్నాల ఫలితమే గ్లోబల్ హ్యుమానిటేరియన్ పర్సనాలిటీగా ఎంపిక చేసినట్టు వారు కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా కారణాల కోసం AED 20 బిలియన్లను యూఏఈ కేటాయించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. వారితోపాటు అబుదాబి డిప్యూటీ పాలకుడు షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, జాయెద్ ఛారిటబుల్ అండ్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ యొక్క ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బోర్డ్ ఆఫ్ జాయెద్ హయ్యర్ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ (ZHO)షేక్ ఖలీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









