విమానంలో 70,000 దిర్హామ్ల రోలెక్స్ చోరీ..!
- May 22, 2024
యూఏఈ: అబుదాబి నుండి దోహా మీదుగా రియాద్కు వెళుతుండగా తన బ్యాగ్లో ఉన్న నగదు, రోలెక్స్ కనిపించకుండా పోయిందని యూఏఈ మాజీ నివాసి అర్సలాన్ హమీద్ తెలిపారు. తన బ్యాగ్ని ఓవర్హెడ్ బిన్లో పెట్టినట్లు గుర్తుచేశారు. అనంతరం పడుకున్నట్లు తెలిపారు. ఇంటికి చేరుకుని చూసుకుంటే 73,000 దిర్హామ్ విలువైన వాచ్, అలాగే SAR3,000 విలువైన నగదు, GBP260 (సుమారు Dh4,000) చోరీ అయినట్లు గుర్తించినట్లు వివరించాడు. ఈ తరహా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, యూఏఈ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నాడు. షార్జా నివాసి ముహమ్మద్ సల్మాన్ లఖానీ కూడా అలాంటి బాధితుల్లో ఒకరు. ఈ సంవత్సరం మేలో రియాద్ నుండి దుబాయ్కి వచ్చే క్రమంలో తన కార్డులలో ఒకటి Dh18,803 మోసపూరిత లావాదేవీ జరిగిందని వివరించాడు. విమానం దిగాక తన క్యారీ-ఆన్ బ్యాగ్ని తనిఖీ చేసినప్పుడు, కార్డులు (15 క్రెడిట్ మరియు ఐదు డెబిట్)తో పాటు $1,900 నగదు కనిపించడం లేదని పేర్కొన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఫ్లైట్ సిబ్బందికి తెలిజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే బ్యాగ్ లను తనిఖీ చేయాలని, చోరీ విషయాన్ని కెప్టెన్ కు తెలియజేయాలని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకోవాలని కెప్టెన్ గ్రౌండ్లోని సెక్యూరిటీకి తెలియజేస్తాడని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం









