ఏందీ కేసుల లొల్లి.! అసలీ పెద్దాయనకి ఏమైంది.?
- May 24, 2024
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఏమైంది ఈ మధ్య.? తరచూ రాయల్టీ విషయంలో ఈ తరం దర్శకులు, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గుస్సా అవుతున్నారు.
తాజాగా మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ‘కమ్మని ఈ ప్రేమలేఖలే..’ అనే సాంగ్ని తన అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడేశారనీ అందుకు రాయల్టీ చెల్లించాలనీ లేదంటే కోర్టుకెళతాననీ ఆయన వివాదం లేవనెత్తారు.
‘మంజుమ్మల్ బాయ్స్’ అనే మలయాళ సినిమా గత రెండు నెలల క్రితం రిలీజై వేరే కారణాల వల్ల వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయం అందుకుంది. ఓటీటీలోనూ జనం బ్రహ్మరథం పట్టారీ సినిమాకి.
అయితే, ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇళయరాజా పెద్దాయన వచ్చి రాయల్టీ అదీ ఇదీ అంటూ వివాదం లేవనెత్తడం శోచనీయం. అయినా ఈ పెద్ద మనిషి ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలే తీసుకొస్తున్నారు. అయితే, చాలా కేసులు అయ్యవారి మాట దాటి కొట్టివేయబడుతున్నాయ్ కూడా.!
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







