ఏందీ కేసుల లొల్లి.! అసలీ పెద్దాయనకి ఏమైంది.?
- May 24, 2024
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఏమైంది ఈ మధ్య.? తరచూ రాయల్టీ విషయంలో ఈ తరం దర్శకులు, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గుస్సా అవుతున్నారు.
తాజాగా మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ‘కమ్మని ఈ ప్రేమలేఖలే..’ అనే సాంగ్ని తన అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడేశారనీ అందుకు రాయల్టీ చెల్లించాలనీ లేదంటే కోర్టుకెళతాననీ ఆయన వివాదం లేవనెత్తారు.
‘మంజుమ్మల్ బాయ్స్’ అనే మలయాళ సినిమా గత రెండు నెలల క్రితం రిలీజై వేరే కారణాల వల్ల వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయం అందుకుంది. ఓటీటీలోనూ జనం బ్రహ్మరథం పట్టారీ సినిమాకి.
అయితే, ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇళయరాజా పెద్దాయన వచ్చి రాయల్టీ అదీ ఇదీ అంటూ వివాదం లేవనెత్తడం శోచనీయం. అయినా ఈ పెద్ద మనిషి ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలే తీసుకొస్తున్నారు. అయితే, చాలా కేసులు అయ్యవారి మాట దాటి కొట్టివేయబడుతున్నాయ్ కూడా.!
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







