ఏందీ కేసుల లొల్లి.! అసలీ పెద్దాయనకి ఏమైంది.?
- May 24, 2024
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఏమైంది ఈ మధ్య.? తరచూ రాయల్టీ విషయంలో ఈ తరం దర్శకులు, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గుస్సా అవుతున్నారు.
తాజాగా మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ‘కమ్మని ఈ ప్రేమలేఖలే..’ అనే సాంగ్ని తన అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడేశారనీ అందుకు రాయల్టీ చెల్లించాలనీ లేదంటే కోర్టుకెళతాననీ ఆయన వివాదం లేవనెత్తారు.
‘మంజుమ్మల్ బాయ్స్’ అనే మలయాళ సినిమా గత రెండు నెలల క్రితం రిలీజై వేరే కారణాల వల్ల వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయం అందుకుంది. ఓటీటీలోనూ జనం బ్రహ్మరథం పట్టారీ సినిమాకి.
అయితే, ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇళయరాజా పెద్దాయన వచ్చి రాయల్టీ అదీ ఇదీ అంటూ వివాదం లేవనెత్తడం శోచనీయం. అయినా ఈ పెద్ద మనిషి ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలే తీసుకొస్తున్నారు. అయితే, చాలా కేసులు అయ్యవారి మాట దాటి కొట్టివేయబడుతున్నాయ్ కూడా.!
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









