ఏందీ కేసుల లొల్లి.! అసలీ పెద్దాయనకి ఏమైంది.?
- May 24, 2024
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఏమైంది ఈ మధ్య.? తరచూ రాయల్టీ విషయంలో ఈ తరం దర్శకులు, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గుస్సా అవుతున్నారు.
తాజాగా మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ‘కమ్మని ఈ ప్రేమలేఖలే..’ అనే సాంగ్ని తన అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడేశారనీ అందుకు రాయల్టీ చెల్లించాలనీ లేదంటే కోర్టుకెళతాననీ ఆయన వివాదం లేవనెత్తారు.
‘మంజుమ్మల్ బాయ్స్’ అనే మలయాళ సినిమా గత రెండు నెలల క్రితం రిలీజై వేరే కారణాల వల్ల వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయం అందుకుంది. ఓటీటీలోనూ జనం బ్రహ్మరథం పట్టారీ సినిమాకి.
అయితే, ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇళయరాజా పెద్దాయన వచ్చి రాయల్టీ అదీ ఇదీ అంటూ వివాదం లేవనెత్తడం శోచనీయం. అయినా ఈ పెద్ద మనిషి ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలే తీసుకొస్తున్నారు. అయితే, చాలా కేసులు అయ్యవారి మాట దాటి కొట్టివేయబడుతున్నాయ్ కూడా.!
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







