ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్‌ పునః ప్రారంభం

- May 25, 2024 , by Maagulf
ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్‌ పునః ప్రారంభం

దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం, ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్‌లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన దుబాయ్ లోని ఎనర్జీ మెట్రో స్టేషన్ ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.

ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. "RTA విజయవంతంగా దుబాయ్ మెట్రో యొక్క పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది." అని తెలిపింది. స్టేషన్ మే 28న కార్యకలాపాలను పునఃప్రారంభించాల్సి ఉండగా,  ప్రణాళిక కంటే ముందే తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మే 19న షెడ్యూల్ కంటే ముందే ఆన్‌పాసివ్, ఈక్విటీ మరియు మష్రెక్ మెట్రో స్టేషన్‌లను పునర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com