బేబీ కేర్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం...ఆరుగురు శిశువులు మృతి
- May 26, 2024
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం 12 మంది పిల్లలనుల్లో ఆరుగురు మరణించారు. ఒకరు వెంటిలేటర్పై ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరారు. రక్షించబడిన నవజాత శిశువులను తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసియు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారి రాజేష్ మాట్లాడుతూ… "రాత్రి 11:32 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. 2 భవనాలు మంటలకు దెబ్బతిన్నాయి. ఒకటి ఆసుపత్రి భవనం మరియు కుడి వైపున ఉన్న నివాస భవనం యొక్క 2 అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. 11-12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారని" తెలిపారు.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







