బేబీ కేర్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం...ఆరుగురు శిశువులు మృతి
- May 26, 2024
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం 12 మంది పిల్లలనుల్లో ఆరుగురు మరణించారు. ఒకరు వెంటిలేటర్పై ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరారు. రక్షించబడిన నవజాత శిశువులను తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసియు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారి రాజేష్ మాట్లాడుతూ… "రాత్రి 11:32 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. 2 భవనాలు మంటలకు దెబ్బతిన్నాయి. ఒకటి ఆసుపత్రి భవనం మరియు కుడి వైపున ఉన్న నివాస భవనం యొక్క 2 అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. 11-12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారని" తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









