బేబీ కేర్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం...ఆరుగురు శిశువులు మృతి
- May 26, 2024
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం 12 మంది పిల్లలనుల్లో ఆరుగురు మరణించారు. ఒకరు వెంటిలేటర్పై ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరారు. రక్షించబడిన నవజాత శిశువులను తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసియు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారి రాజేష్ మాట్లాడుతూ… "రాత్రి 11:32 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. 2 భవనాలు మంటలకు దెబ్బతిన్నాయి. ఒకటి ఆసుపత్రి భవనం మరియు కుడి వైపున ఉన్న నివాస భవనం యొక్క 2 అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. 11-12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారని" తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







