ఏపీ ఉద్యోగులకు శుభవార్త..
- June 10, 2016
ఏపీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల స్థానికతకు రాష్ర్టపతి ఆమోద ముద్రవేశారు. దీనికి సంబంధించి 4 పేజీల గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. దీంతో స్థానికతపై స్పష్టత ఏర్పడింది. ఇప్పటివరకు తెలంగాణలోవుండి విభజన నేపథ్యంలో తిరిగి ఏపీకి వెళ్లే వారి స్థానికతపై స్పష్టత లేకుండాపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లేవారికి అక్కడ స్థానికత వర్తించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఒకవిధంగా హైదరాబాద్లోవున్న ఏపీ ఉద్యోగులకు శుభవార్తే!
ఉద్యోగుల స్థానికతకు సంబంధించి అడ్డంకులను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రద్రబాబునాయుడు అక్టోబర్లో కేంద్రానికి 7 పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే!సుమారు ఎనిమిది నెలల కసరత్తు అనంతరం స్థానికతపై తుది నిర్ణయం వెలువడింది. గత సోమవారం ఈ ఫైల్ను రాష్ట్రపతిభవన్కు పంపగా, శుక్రవారం నోటిఫికేషన్ను జారీ అయింది. 2017 జూన్ 2 నాటికి ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులు, వారి పిల్లలు, సామాన్య ప్రజలకు స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్తో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఉద్యోగుల స్థానికత అంశానికి ఫుల్స్టాప్ పడింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







