ఏపీ ఉద్యోగులకు శుభవార్త..
- June 10, 2016
ఏపీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల స్థానికతకు రాష్ర్టపతి ఆమోద ముద్రవేశారు. దీనికి సంబంధించి 4 పేజీల గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. దీంతో స్థానికతపై స్పష్టత ఏర్పడింది. ఇప్పటివరకు తెలంగాణలోవుండి విభజన నేపథ్యంలో తిరిగి ఏపీకి వెళ్లే వారి స్థానికతపై స్పష్టత లేకుండాపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లేవారికి అక్కడ స్థానికత వర్తించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఒకవిధంగా హైదరాబాద్లోవున్న ఏపీ ఉద్యోగులకు శుభవార్తే!
ఉద్యోగుల స్థానికతకు సంబంధించి అడ్డంకులను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రద్రబాబునాయుడు అక్టోబర్లో కేంద్రానికి 7 పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే!సుమారు ఎనిమిది నెలల కసరత్తు అనంతరం స్థానికతపై తుది నిర్ణయం వెలువడింది. గత సోమవారం ఈ ఫైల్ను రాష్ట్రపతిభవన్కు పంపగా, శుక్రవారం నోటిఫికేషన్ను జారీ అయింది. 2017 జూన్ 2 నాటికి ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులు, వారి పిల్లలు, సామాన్య ప్రజలకు స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్తో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఉద్యోగుల స్థానికత అంశానికి ఫుల్స్టాప్ పడింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









