హైదరాబాద్లో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ పట్టివేత
- June 01, 2024
హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. తాజాగా ఎక్సైజ్ పోలీసులు మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్న కుష్, ఓజీ డ్రగ్స్ ను లాలాగూడలో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
కాగా పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కుష్, ఓజీ డ్రగ్ ఆఫ్రికా, అమెరికాలో ఎక్కువగా లభిస్తుందని.. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రగ్ కారణంగా లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. ఈ కుష్, ఓజీ మందు ఆఫ్రికా, అమెరికాలో విరివిగా లభిస్తుందని.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందు వల్ల కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. వీరిని డ్రగ్స్తో పట్టుకుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









