శర్వానంద్ సినిమాకి ‘మనమే’ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే.!
- June 01, 2024
శర్వానంద్ విలక్షణ నటుడు.. ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ మొదట్లో సీరియస్ రోల్స్ చేసేవాడు. ‘రన్ రాజా రన్’ సినిమాతో తనలోని హ్యూమరస్ యాంగిల్ బయట పెట్టి వరుస సక్సెస్లు అందుకోవడం మొదలు పెట్టాడు.
దాంతో, మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ‘రణరంగం’, ‘మహా సముద్రం’ వంటి సీరియస్ మూవీస్ చేసి మళ్లీ బోల్తా కొట్టాడు. దాంతో మనసు మార్చుకున్నాడు.
తనకు సక్సెస్ ఇచ్చిన ట్రాక్లోనే నడవాలనుకున్నాడు. అలా ‘మనమే’ సినిమా టేకప్ చేశాడు. ఈ సినిమా వచ్చే నెల 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయ్. ఈ క్రమంలోనే తనకు బెస్ట్ ఫ్రెండ్, గ్లోబల్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయించాడు.
మరోవైపు సినిమాకి పాజిటివ్ బజ్ కూడా బాగానే వుంది. కంటెంట్ పరంగానూ ఈ సినిమా ఈ మధ్య సక్సెస్ ఫార్ములాస్కి దగ్గరగా వుంది. అన్నట్లు ఈ సినిమా ట్రయాంగిల్ ఎమోషన్తో సాగే కథ. ఆ కథలో ఓ భర్త, భార్య, ఓ చిన్న పిల్లవాడు.. వున్నారు. ఈ ముగ్గురి చుట్టూనే కథ నడవబోతోంది. అందుకే ‘మనమే’ అనే పేరు ఈ సినిమాకి టైటిల్గా పెట్టారట.
అన్ని రకాల సెంటిమెంట్లు కలిసొచ్చి సినిమా హిట్టయితే, ఓ వైపు శర్వాకీ, మరోవైపు కృతి శెట్టికీ ఇద్దరికీ అదృష్టం కలిసొచ్చినట్లే.!
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







