కొత్త యువరాజుకు భారత రాయబారి శుభాకాంక్షలు
- June 03, 2024
కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అభినందనలు తెలిపారు. ఇండియా, కువైట్ మధ్య చారిత్రాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు రాయబారి తెలిపారు. "కువైట్ రాష్ట్ర యువరాజుగా బాధ్యతలు స్వీకరించినందుకు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న హిస్ హైనెస్ ది క్రౌన్ భవిష్యత్తులో దేశాన్ని నడిపించడానికి ప్రిన్స్ తనతో పాటు గొప్ప అనుభవాన్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రాత్మకమైన , బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. ’’ అని రాయబారి తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







