కొత్త యువరాజుకు భారత రాయబారి శుభాకాంక్షలు
- June 03, 2024
కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అభినందనలు తెలిపారు. ఇండియా, కువైట్ మధ్య చారిత్రాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు రాయబారి తెలిపారు. "కువైట్ రాష్ట్ర యువరాజుగా బాధ్యతలు స్వీకరించినందుకు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న హిస్ హైనెస్ ది క్రౌన్ భవిష్యత్తులో దేశాన్ని నడిపించడానికి ప్రిన్స్ తనతో పాటు గొప్ప అనుభవాన్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రాత్మకమైన , బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. ’’ అని రాయబారి తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







