ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్
- June 05, 2024
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ వేర్వేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరూ పాల్గననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ బయల్దేరే ముందు ఎన్డీయేలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. వారందరికీ అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పని చేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









