ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్

- June 05, 2024 , by Maagulf
ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వేర్వేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరూ పాల్గననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ బయల్దేరే ముందు ఎన్డీయేలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో పవన్‌ సమావేశమయ్యారు. వారందరికీ అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పని చేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com