ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం 'యశస్వి’ స్కాలర్షిప్
- June 08, 2024
న్యూ ఢిల్లీ: సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ (సీసీఈఈఎం) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ‘యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనీషియేటివ్ (యశస్వి) పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని శుక్రవారం ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్ ప్రారంభించారు.
మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాలంటే ఇంజినీరింగ్లోని ఈ బ్రాంచ్లు చాలా ముఖ్యమైనవని సీతారామ్ చెప్పారు.ఏఐసీటీఈ ఆమోదం గల టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ల లోని ఈ బ్రాంచ్ల్లో చేరే ప్రతిభావంతు లైన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
డిగ్రీ చదువుతున్నవిద్యార్థులకు సంవత్సరానికి రూ.18,000 చొప్పున గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు, డిప్లమో విద్యార్థులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున గరిష్ఠంగా మూడేళ్ల వరకు ఉపకార వేతనం ఇస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం 2,500 మంది డిగ్రీ విద్యార్థులకు, 2,500 మంది డిప్లమో విద్యార్థులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







