ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం 'యశస్వి’ స్కాలర్షిప్
- June 08, 2024
న్యూ ఢిల్లీ: సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ (సీసీఈఈఎం) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ‘యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనీషియేటివ్ (యశస్వి) పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని శుక్రవారం ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్ ప్రారంభించారు.
మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాలంటే ఇంజినీరింగ్లోని ఈ బ్రాంచ్లు చాలా ముఖ్యమైనవని సీతారామ్ చెప్పారు.ఏఐసీటీఈ ఆమోదం గల టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ల లోని ఈ బ్రాంచ్ల్లో చేరే ప్రతిభావంతు లైన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
డిగ్రీ చదువుతున్నవిద్యార్థులకు సంవత్సరానికి రూ.18,000 చొప్పున గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు, డిప్లమో విద్యార్థులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున గరిష్ఠంగా మూడేళ్ల వరకు ఉపకార వేతనం ఇస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం 2,500 మంది డిగ్రీ విద్యార్థులకు, 2,500 మంది డిప్లమో విద్యార్థులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







