13న బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 11, 2024![1 13న బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి](https://www.maagulf.com/godata/articles/202406/KRR_1718114311.jpg)
న్యూ ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మోడీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మోడీ 2.0 మంత్రి మండలిలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డికి మోడీ 3.0 కేబినెట్ లో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా ఛాన్స్ దక్కింది.
కేంద్ర మంత్రిగా ప్రధాని మోడీతో పాటే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి. మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.
ఈ క్రమంలో కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిగా చార్జ్ తీసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13న ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, మోడీ 3.0 కేబినెట్లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో మంత్రి దక్కగా.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు హోం శాఖ సహాయ మంత్రి పోస్ట్ లభించింది.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..