దుబాయ్ స్కూళ్లలో త్వరలో AI-టీచర్లు..!
- June 13, 2024
యూఏఈ: దుబాయ్ పాఠశాలల్లో త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఉండనున్నారు. బుధవారం, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు ప్రకటించారు. ఎమిరేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. AI అప్లికేషన్ల స్వీకరణను వేగవంతం చేయడానికి దుబాయ్ యొక్క వార్షిక ప్రణాళికకు అనుగుణంగా ప్రోగ్రామ్ ఉందన్నారు. AIని తమ బోధనా పద్ధతుల్లో సమర్ధవంతంగా అనుసంధానించే టాప్ 10 మంది ఉపాధ్యాయులు 2025 AI రిట్రీట్లో సత్కరించనున్నట్లు వెల్లడించారు. "మా విద్యార్ధులకు భవిష్యత్తు-సిద్ధమైన సాధనాలతో సన్నద్ధం చేసే విద్యా వ్యవస్థను రూపొందించడం మరియు AI సాంకేతికతలతో కూడిన సరైన అభ్యాస వాతావరణాన్ని అందించడం మా లక్ష్యం. విద్యలో పెట్టుబడి పెట్టడం అనేది దుబాయ్ ప్రస్తుత మరియు భవిష్యత్తులో పెట్టుబడి." అని షేక్ హమ్దాన్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







