కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- March 04, 2026
కువైట్: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ వివాదం అనేక మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంటుంది. తాజాగా కువైట్ లో ఓ 11 బాలిక ప్రాణాలను బలికొన్నది. క్యాపిటర్ గవర్నేట్ లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ను కువైట్ ఎయిర్ సెక్యూరిటీ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ క్రమంలో ఆ డ్రోన్ శకలాలు ఓ నివాస ప్రాంతంపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లో ఉంటున్న 11 ఏళ్ల బాలికతో సహా వారి ఫ్యామిలీ సభ్యులకు గాయాలయ్యాయి.
అత్యవసర వైద్య బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరికొని వారిని సమీపంలోని అల్ అమిరి ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలిక చికిత్స పొందుతూ మరణించిందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక మృతురాలి తల్లితో సహా మరో నలుగురు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







