కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- March 04, 2026
కువైట్: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ వివాదం అనేక మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంటుంది. తాజాగా కువైట్ లో ఓ 11 బాలిక ప్రాణాలను బలికొన్నది. క్యాపిటర్ గవర్నేట్ లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ను కువైట్ ఎయిర్ సెక్యూరిటీ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ క్రమంలో ఆ డ్రోన్ శకలాలు ఓ నివాస ప్రాంతంపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లో ఉంటున్న 11 ఏళ్ల బాలికతో సహా వారి ఫ్యామిలీ సభ్యులకు గాయాలయ్యాయి.
అత్యవసర వైద్య బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరికొని వారిని సమీపంలోని అల్ అమిరి ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలిక చికిత్స పొందుతూ మరణించిందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక మృతురాలి తల్లితో సహా మరో నలుగురు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









