కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- March 04, 2026
కువైట్: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ వివాదం అనేక మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంటుంది. తాజాగా కువైట్ లో ఓ 11 బాలిక ప్రాణాలను బలికొన్నది. క్యాపిటర్ గవర్నేట్ లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ను కువైట్ ఎయిర్ సెక్యూరిటీ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ క్రమంలో ఆ డ్రోన్ శకలాలు ఓ నివాస ప్రాంతంపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లో ఉంటున్న 11 ఏళ్ల బాలికతో సహా వారి ఫ్యామిలీ సభ్యులకు గాయాలయ్యాయి.
అత్యవసర వైద్య బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరికొని వారిని సమీపంలోని అల్ అమిరి ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలిక చికిత్స పొందుతూ మరణించిందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక మృతురాలి తల్లితో సహా మరో నలుగురు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









