విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి

- June 15, 2024 , by Maagulf
విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి

విజయవాడ: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేతులమీదుగా విజయవాడ నుంచి ముంబై నగరానికి ఎయిర్ ఇండియా సంస్థ తీసుకొచ్చిన నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.ఎంపీ బాలశౌరి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,రిబ్బన్ కత్తిరించి నూతన సర్వీసుని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మొదటి బోర్డింగ్ పాస్ ని ప్రయాణికులకు ఎంపీ బాలశౌరి అందజేశారు.ముంబైకి మన రాజధాని అమరావతి నుంచి విమాన సర్వీస్ తీసుకురావాలని కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయని తెలిపారు.ముంబై నగరానికి సర్వీస్ రావడం వల్ల విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉపయోగపడుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com