400% పెరిగిన అపార్ట్మెంట్ వ్యర్థాలు
- June 17, 2024
కువైట్: కువైట్లో అపార్ట్మెంట్ భద్రతా నిబంధనలపై అవగాహన పెంచిన మంగాఫ్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కువైట్ మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా వ్యర్థాలు 400% పెరిగినట్లు నివేదించింది. ఈ వ్యర్థాలలో ఎక్కువ భాగం వివిధ అపార్ట్మెంట్ భవనాలలో నిల్వ చేయబడిన అనవసరమైన వస్తువులను కలిగి ఉన్నాయని పేర్కొంది. మొత్తం ఆరు గవర్నరేట్లలో 568 టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. ఈ మొత్తం సాధారణ రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని, ఇది సాధారణంగా ఈ ప్రాంతాల్లో సాధారణ రోజులో 100 మరియు 150 టన్నుల మధ్య ఉంటుందని తెలిపింది. అన్ని గవర్నరేట్లలోని పరిశుభ్రత విభాగాలు తమ ఆస్తుల ముందు శిధిలాలు, వ్యర్థాలను పారవేసే వారిపై జరిమానాలు విధిస్తాయని భవన యజమానులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు









