400% పెరిగిన అపార్ట్మెంట్ వ్యర్థాలు
- June 17, 2024
కువైట్: కువైట్లో అపార్ట్మెంట్ భద్రతా నిబంధనలపై అవగాహన పెంచిన మంగాఫ్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కువైట్ మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా వ్యర్థాలు 400% పెరిగినట్లు నివేదించింది. ఈ వ్యర్థాలలో ఎక్కువ భాగం వివిధ అపార్ట్మెంట్ భవనాలలో నిల్వ చేయబడిన అనవసరమైన వస్తువులను కలిగి ఉన్నాయని పేర్కొంది. మొత్తం ఆరు గవర్నరేట్లలో 568 టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. ఈ మొత్తం సాధారణ రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని, ఇది సాధారణంగా ఈ ప్రాంతాల్లో సాధారణ రోజులో 100 మరియు 150 టన్నుల మధ్య ఉంటుందని తెలిపింది. అన్ని గవర్నరేట్లలోని పరిశుభ్రత విభాగాలు తమ ఆస్తుల ముందు శిధిలాలు, వ్యర్థాలను పారవేసే వారిపై జరిమానాలు విధిస్తాయని భవన యజమానులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







