సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ
- June 18, 2024
హైదరాబాద్: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ముందుగా రాగా..తాజాగా మంగళవారం లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెజ్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని సత్కరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో దావోస్లో చర్చలు సైతం జరిపింది. అయితే, లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







